భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఐర్లాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ ఆ జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో హార్దిక్ మరో వికెట్ తీశాడు. గారెత్ డెలనీ (8)ని ఆవేష్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత హ్యారీ టెక్టార్ ధాటిగా ఆడుతుండగా.. అతనికి కాసేపు సహకరించిన వికెట్ కీపర్ లాక్రాన్ టక్కర్ (18)ను చాహల్ అవుట్ చేశాడు.
హార్దిక్ వేసిన 8వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతను.. చాహల్ వేసిన మరుసటి ఓవర్లో కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అది సరిగా కనెక్ట్ కాకపోవడంతో డీప్ స్క్వేర్ లెగ్లో ఆవేష్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 9 ఓవర్లకు ఐర్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 73 పరుగులతో నిలిచింది.