హాంకాంగ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ (21) అవుటయ్యాడు. ఆయుష్ శుక్లా వేసిన ఐదో ఓవర్లో భారీ షాట్తో బౌండరీ బాదిన రోహిత్.. మరుసటి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్కు తగిలిన బంతి గాల్లోకి లేచింది. దాన్ని ఐజాజ్ ఖాన్ చక్కగా అందుకోవడంతో రోహిత్ మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో 38 పరుగుల వద్ద భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తొలి పవర్ ప్లే ముగిసే సరికి భారత జట్టు 44/1 స్కోరుతో నిలిచింది.