హాంగ్ కాంగ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ ఘజన్ఫర్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి కేఎల్ రాహుల్ (36) అవుటయ్యాడు. క్రీజులో కుదురుకోవడానికి నానా తిప్పలు పడిన రాహుల్.. కుదురుకున్న తర్వాత కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. రెండు సిక్సర్లు బాదినప్పటికీ 39 బంతుల్లో కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. చివరకు ఘజన్ఫర్ వేసిన బంతిని ఆఫ్సైడ్ ఆడే క్రమంలో కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 94 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.