భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో హాంగ్కాంగ్ జట్టు అదరగొడుతోంది. ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్ వేసిన ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడిన ఆ జట్టు ఆటగాడు బాబర్ హయత్ (29 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. అతనికి కొంత సహకారం అందించిన నిజాకత్ ఖాన్ (10) ఆరో ఓవర్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. ఆరో ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ రెండు నోబాల్స్ వేశాడు. ఓవర్ రెండో బంతికి నోబాల్ వేయగా.. ఫ్రీహిట్లో ఫోర్ వచ్చింది.
ఆ తర్వాత నోబాల్కు సింగిల్ తీయగా.. ఫ్రీహిట్ బంతికి నిజాకత్ ఖాన్ రనౌట్ అయ్యాడు. జడేజా వైపుగా బంతిని కొట్టిన నిజాకత్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే బంతిని పట్టుకున్న వెంటనే వికెట్ల వైపు జడ్డూ వేసిన త్రో మిస్ అవలేదు. దాంతో నిజాకత్ నిరాశగా మైదానం వీడాడు. పవర్ప్లే ముగిసే సరికి హాంగ్కాంగ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులతో నిలిచింది.