ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఎడంచేతి వాటం బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆటలో రిషభ్ పంత్ (146) అదరగొట్టగా.. రెండో రోజున రవీంద్ర జడేజా (104) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాట్స్ వేసిన ఓవర్ చివరి రెండు బంతులకు బౌండరీలు బాదిన జడ్డూ తన స్టైల్లో బ్యాటును కత్తిలా తిప్పుతూ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. అతనికి అప్పటి వరకు సహకరించిన మహమ్మద్ షమీ (16) ఆ తర్వాతి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు.
బ్రాడ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని థర్డ్మ్యాన్ దిశగా బౌండరీ దాటించేందుకు షమీ ప్రయత్నించాడు. అయితే టైమింగ్ మిస్ అవడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న లీచ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇది బ్రాడ్ కెరీర్లో 550వ టెస్టు వికెట్ కావడం గమనార్హం. ఆ తర్వాత కాసేపటికే ఆండర్సన్ బౌలింగ్లో జడేజా బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 375 పరుగులతో ఉంది.
Brilliant from Jadeja! A 💯 for the ages. What a sensational fightback by 🇮🇳 led by two left-handers
P.S. Check out Kohli’s celebration of Jaddu’s ton #INDvsENG pic.twitter.com/fjRsqAPkUQ
— Sohini M. (@Mittermaniac) July 2, 2022