ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ బుమ్రా తొలి వికెట్ తీశాడు. అంతకుముందు బ్యాటుతో రాణించిన బుమ్రా.. జట్టు స్కోరును 416 పరుగులకు తీసుకెళ్లాడు. అయితే సిరాజ్ (7) అవుటవడంతో టీమిండియా ఆలౌట్ అయింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ను బుమ్రానే తొలి దెబ్బ కొట్టాడు.
అలెక్స్ లీస్ (6)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతకుముందు బంతికే నోబాల్ వేసిన బుమ్రా.. మరుసటి బంతికి లీస్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 16 పరుగులకే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్కు అంతరాయం కలిగింది.