IND vs ENG 3rd Test | భారత్-ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో రోహిత్ సేన జయకేతనం ఎగురవేసింది. హైదరాబాద్ టెస్టులో ఓడినా తర్వాత పుంజుకున్న భారత్.. వైజాగ్లో ఇంగ్లండ్కు ఓటమి రుచి చూపించి తాజాగా రాజ్కోట్లో బెన్ స్టోక్స్ అండ్ కో. ను కోలుకోలేని దెబ్బకొట్టింది. కొద్దిసేపటి క్రితమే ముగిసిన మూడో టెస్టులో భారత్.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించగా ఇంగ్లండ్.. పరుగులపరంగా అత్యంత భారీ తేడాతో ఓడి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. టెస్టులలో ఆ జట్టుకు పరుగులపరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమి.
భారత్కు భారీ గెలుపు..
ఈ టెస్టులో భారత్ నిర్దేశించిన 557 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్.. 122 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా భారత్ 434 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ కంటే ముందు భారత్.. 2021లో ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 372 పరుగుల తేడాతో గెలవడమే ఇప్పటివరకు రికార్డు. 400 ప్లస్ పరుగుల తేడాతో గెలవడం భారత్కు ఇదే తొలిసారి. ప్రపంచ క్రికెట్లో చూస్తే పరుగులపరంగా భారత్.. 8వ స్థానంలో ఉంది. ఇంగ్లండ్ జట్టు.. 1928లో ఆసీస్పై 675 రన్స్ తేడాతో ఓడించింది.
ఇంగ్లండ్కు దారుణ ఓటమి..
ఇంగ్లండ్కు టెస్టులలో ఇది రెండో అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు ఆ జట్టు 1934లో ఆస్ట్రేలియా చేతిలో 562 రన్స్ తేడాతో ఓడింది. 2000వ శతాబ్దంలో మాత్రం ఆ జట్టుకు ఇదే తొలి అతిపెద్ద ఓటమి.
🚨 𝙍𝙚𝙘𝙤𝙧𝙙 𝘼𝙡𝙚𝙧𝙩! 🚨
With a winning margin of 434 runs in Rajkot, #TeamIndia register their biggest Test victory ever 👏🔝
A historic win courtesy of some memorable performances 👌👌
Scorecard ▶️ https://t.co/FM0hVG5X8M#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/nXbjlAYq7K
— BCCI (@BCCI) February 18, 2024
పరుగుల పరంగా ఇంగ్లండ్ భారీ ఓటములు..
– 562 (ఆస్ట్రేలియా)
– 434 (ఇండియా)
– 425 (వెస్టిండీస్)
– 409 (ఆస్ట్రేలియా)
– 405 (ఆస్ట్రేలియా)
టెస్టులలో బెన్ స్టోక్స్ ఇంగ్లండ్కు సారథి అయ్యాక ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్లలో ఓడటం ఇది రెండోసారి మాత్రమే. 2023లో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్, లార్డ్స్లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది.