IND vs ENG 3rd Test | రాజ్కోట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్ దంచికొడుతోంది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 88 బంతుల్లోనే మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు. ఈ సిరీస్లో తొలిసారి అర్థ సెంచరీ మార్కును దాటిన డకెట్.. రాజ్కోట్లో శతకాన్ని పూర్తిచేయడం విశేషం. 39 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న డకెట్.. 88 బంతులలో సెంచరీ సాధించాడు. డకెట్ ఇన్నింగ్స్లో 19 బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంటే సిక్సర్, ఫోర్ల రూపంలోనే అతడు 82 పరుగులు రాబట్టడం గమనార్హం. రెండో రోజు మూడో సెషన్లో 28 ఓవర్లు ముగిసేటప్పటికీ ఇంగ్లండ్.. ఒక వికెట్ నష్టానికి 163 పరుగులు చేసింది. డకెట్ (108 నాటౌట్) , ఒలీ పోప్ (32 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
రెండో రోజు భారత్ను రెండో సెషన్లో 445 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. ఆరంభం నుంచి ఎదురుదాడికి దిగింది. జాక్ క్రాలే కాస్త నెమ్మదిగా ఆడినా డకెట్ మాత్రం భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, సిరాజ్లను లక్ష్యంగా చేసుకుని అతడు బౌండరీల వర్షం కురిపించాడు.
💯 FOR OUR VERY OWN BEN DUCKETT!
Our @BarmyArmyTravel group rise to celebrate a special knock 😍#INDvENG pic.twitter.com/3GrtCU6d7Y
— England’s Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) February 16, 2024
88 బంతుల్లో సెంచరీ పూర్తిచేయడంతో డకెట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టులలో వేగంగా వంద పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో డకెట్.. కెవిన్ పీటర్సన్తో కలిసి 8వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో గిల్బర్ట్ జెసప్.. 1902లో ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టులో 76 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. ఈ జాబితాలో జానీ బెయిర్ స్టో (77), హ్యారీ బ్రూక్ (80), బెన్ స్టోక్స్ (85), ఇయాన్ బోథమ్ (86- రెండుసార్లు), జాక్ క్రాలే (86), కెవిన్ పీటర్సన్ (88) లు ఉన్నారు.