Shubman Gill: టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్.. ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్కు క్షమాపణలు చెప్పాడు. వైజాగ్ టెస్టులో భారత్.. ఇంగ్లండ్ను ఓడించాక జహీర్ ఖాన్, కెవిన్ పీటర్సన్లతో కలిసి ముచ్చటించిన గిల్.. సెంచరీ చేశాక తాను కేపీ దగ్గరకు రాలేకపోయానని, అందుకు తనను క్షమించాలని కోరాడు. ఇంగ్లండ్తో హైదరాబాద్ వేదికగా ముగిసిన టెస్టులో గిల్ విఫలమవడంతో విమర్శకులతో పాటు క్రికెట్ అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక అతడిని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ పీటర్సన్ మాత్రం గిల్కు అండగా నిలిచాడు.
హైదరాబాద్ టెస్టులో గిల్ వైఫల్యం నేపథ్యంలో పీటర్సన్ ట్విటర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ… గిల్ విషయంలో అభిమానులు, విమర్శకులు కాస్త వేచి ఉండాలని కోరాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వస్ కలిస్ తొలి పది టెస్టులలో సగటు కూడా 22 మాత్రమే ఉందని, కానీ ఆ తర్వాత అతడు దిగ్గజంగా ఎదిగాడని, గిల్ విషయంలో కూడా అభిమానులు కొంత సంయమనం పాటించాలని పేర్కొన్నాడు. వైజాగ్ టెస్టులో సెంచరీ చేశాక గిల్పై ప్రశంసలు కురిపించాడు.
అయితే మ్యాచ్ ముగిశాక గిల్ మాట్లాడుతూ… ‘నేను మిమ్మల్ని కలవలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి. కానీ నేను నా వేలికి గాయం కారణంగా నేను స్కానింగ్కు వెళ్లాల్సి వచ్చింది..’ అని అన్నాడు. వైజాగ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 46 బంతుల్లో 34 పరుగులు చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్లో 147 బంతుల్లో 104 రన్స్ చేశాడు.