IND vs ENG 1st Test: ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు ముగ్గురు సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు 80లలో ఔట్ అయి శతకాలు మిస్ చేసుకున్నారు. 92 ఏండ్ల భారత క్రికెట్ చరిత్ర (1932లో భారత్.. ఇంగ్లండ్తో తొలి మ్యాచ్ ఆడింది) లో ఇలా జరుగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాహుల్, జడేజాలు 14 పరుగుల తేడాతో మూడంకెల స్కోరుకు దూరంగా నిలిచారు.
భారత్ తొలి ఇన్నింగ్స్లో ధాటిగా ఆడిన జైస్వాల్.. 74 బంతుల్లోనే 10 బౌండరీలు, 3 భారీ సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. తొలి రోజు దూకుడుగా ఆడిన జైస్వాల్.. రెండో రోజు రూట్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్ కూడా సెంచరీ చేసే దిశగా సాగాడు. రెండో రోజు ఆటలో రాహుల్ ఆటే హైలైట్. వన్డే వరల్డ్ కప్ ఫామ్ను కొనసాగిస్తూ ఆడిన రాహుల్.. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. 123 బంతుల్లో 8 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 86 రన్స్ చేసిన రాహుల్.. హర్ట్లీ బౌలింగ్లో రిహాన్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
– Ravindra Jadeja on 87.
– KL Rahul on 86.
– Yashasvi Jaiswal on 80.– Three Indian players got out on 80s in this innings…!!! pic.twitter.com/dGvczt7apy
— CricketMAN2 (@ImTanujSingh) January 27, 2024
ఇక జడేజా విషయానికొస్తే.. భారత్కు భారీ ఆధిక్యం అందించడంలో జడ్డూ కీలక పాత్ర పోషించాడు. రాహుల్తో పాటు శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్ తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించిన జడ్డూ.. 180 బంతులాడి 87 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 7 బౌండరీలు, 2 సిక్సర్లున్నాయి. జడ్డూ మరో 13 పరుగులు చేసుంటే శతకం పూర్తిచేసుకునేవాడు. జడేజాను రూట్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఈ ముగ్గురు శతకాలు మిస్ చేసుకున్నా మెరుగ్గా రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 436 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 190 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది.