IND vs BAN | బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో గెలిచి సెమీస్కు దాదాపుగా బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. విరాట్ కోహ్లీ (64) రన్స్తో రాణించాడు. టోర్నీల్లో ఫామ్లో లోని కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక సూర్య కుమార్ వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి టీమిండియా 184 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్కు దిగిన బంగ్లాదేశ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో బంగ్లాదేశ్ టార్గెట్ను 16 ఓవర్లకు 151 పరుగులకు కుదించారు.. అయితే నిర్ణీత పరుగులను చేసేందుకు చివరి వరకు పోరాడింది. చివరకు 145 పరుగులకే పరిమితమైంది.