దుబాయ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఆసీస్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ జట్టును స్మిత్ (23), మ్యాక్స్వెల్ (37) జోడీ ఆదుకుంది. ముఖ్యంగా మ్యాక్స్వెల్ తన స్ట్రైక్ రేట్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడుతూ ఆడుతున్నాడు.
జడేజా వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే రాహుల్ చాహర్ అతనికి షాకిచ్చాడు. తన ఓవర్ తొలిబంతికి ఫోర్ కొట్టిన మ్యాక్స్వెల్ను ఐదో బంతికి చాహర్ బౌల్డ్ చేశాడు. దీంతో స్మిత్, మ్యాక్స్వెల్ జోడీ నెలకొల్పిన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ప్రస్తుతం మార్కస్ స్టొయినిస్, స్మిత్ క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియాకు రోహిత్ శర్మ సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.