IND vs AUS : నాగ్పూర్ టెస్టులో రెండో రోజు టీమిండియా జోరు కొనసాగించింది. రెండో ఆట ముగిసే సరికి భారత్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ ఫిఫ్టీలతో ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్కు 81రన్స్ జోడించారు. దాంతో, టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 321 రన్స్ చేసింది. పుజారా (7), కోహ్లీ (12) ఆరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ (8) స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. ఈ ముగ్గురిని ఔట్ చేసిన మర్ఫీ ఆస్ట్రేలియాను పోటీలో నిలిపాడు. రోహిత్ ఔటయ్యాక వీళ్లిద్దరూ ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్ 300 దాటించారు. మర్ఫీ, లియాన్ స్పిన్ను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచారు. ఈ పిచ్పై 250 పైగా స్కోర్ చేస్తే.. ఆతిథ్య ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టొచ్చని మాజీలు అంటున్నారు. దాంతో, మూడో రోజు ఆట కీలకం కానుంది.
ఓవర్నైట్ స్కోర్ 56తో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ (120)తో కదం తొక్కాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ టెస్టుల్లో 9వ శతకం బాదాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. రాహుల్, అశ్విన్ ఆ తర్వాత రవీంద్ర జడేజాతో కలిసి అతను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అతను ఔటయ్యాక.. జడేజా ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 18వ ఫిఫ్టీ సాధించాడు. దాంతో, అత్యధికంగా ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి, హాఫ్ సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. జడ్డూ 6 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్ (5 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు.
మర్ఫీకి ఐదు వికెట్లు
ఆసీస్ స్పిన్నర్ మర్ఫీ ఆరంగేట్రం మ్యాచ్లోనే ఐదు వికెట్లు సాధించాడు. స్పిన్కు అనుకూలించిన పిచ్పై అతను చెలరేగాడు. కీలకమైన రాహుల్, అశ్విన్, పూజారా, కోహ్లీ వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్లోనే 5 వికెట్లు తీసిన ఆసీస్ నాలుగో ఆఫ్ స్పిన్నర్గా మర్ఫీ రికార్డుల్లోకి ఎక్కాడు.