ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో తాము ముందుగా బౌలింగ్ చేయనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే తమ జట్టులో ఒక మార్పు జరిగినట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్లో పంత్ ఆడటం లేదని, భువనేశ్వర్ తిరిగి జట్టులో కలుస్తున్నాడని చెప్పాడు. గత మ్యాచ్లో భువనేశ్వర్ పక్కనపెట్టి పంత్ను ఆడించిన సంగతి తెలిసిందే. మిగతా జట్టులో మార్పులు లేవని రోహిత్ అన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో కూడా ఒక మార్పు చేసినట్లు ఆ జట్టు సారధి ఆరోన్ ఫించ్ తెలిపాడు. సీన్ అబాట్ స్థానంలో జోష్ ఇంగ్లిస్ ఆడుతున్నట్లు వెల్లడించాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, డానియల్ శామ్స్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్
🚨 Toss Update 🚨#TeamIndia have elected to bowl against Australia in the third #INDvAUS T20I.
Follow the match ▶️ https://t.co/xVrzo737YV pic.twitter.com/QkinggmHiU
— BCCI (@BCCI) September 25, 2022