IND vs AUS : భారత్-అస్ట్రేలియా (India vs Australia) దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్లు (Indian batters) అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) చెలరేగి ఆడటంతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 237 పరగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన ఆస్ట్రేలియా కేవలం 38.3 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో రెన్షా (56) మాత్రమే అర్ధశతకం సాధించాడు. మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29), మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ క్యారీ (24), కూపర్ కాన్లీ (23) పరవాలేదనిపించారు. ఆఖరులో బౌలర్ నాథన్ ఎలిస్ (16) కాస్త మెరుపులు మెరిపించినా మిగతా వాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా తన సత్తా చూపించాడు. 8.4 ఓవర్లలో 39 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (121) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 125 బంతుల్లో అజేయంగా 121 (13×4, 6×3) పరుగులు చేశాడు. రోహిత్కు జతగా ఓపెనర్గా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్మాన్ గిల్ (24) ధాటిగానే ఆటను ప్రారంభించినా 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హేజిల్వుడ్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్డౌన్గా బరిలో దిగిన కోహ్లీ (74; 7×4) రోహిత్ శర్మతో కలిసి ఆసీస్ టీమ్కు చుక్కలు చూపించారు. అయితే మూడు వన్డేల సిరీస్లో మొదటి రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియాకు ట్రోఫీ దక్కింది. సిరీస్ను 2-1 తేడాతో ఆసీస్ గెలుచుకుంది.