IND vs AUS : తొలి టెస్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ కొట్టాడు. 114 బంతుల్లో జడ్డూ ఫిఫ్టీ బాదాడు. స్కాట్ బోలండ్ ఓవర్లో సింగిల్ తీసి 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అనంతరం తన స్టయిల్లో బ్యాట్ను తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికి ఇది 18వ అర్థ సెంచరీ. సెంచరీ హీరో రోహిత్ శర్మ (120) ఔటయ్యాక శ్రీకర్ భరత్ (8), అక్షర్ పటేల్తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. అక్షర్ పటేల్తో కలిసి ఎనిమిదో వికెట్కు 17 రన్స్ జోడించాడు. ఇండియా 80 పరుగుల ఆధిక్యంలో ఉంది.
గాయం నుంచి కోలుకున్న తర్వాత జడేజా ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. అయినా కూడా ఈ నంబర్ వన్ ఆల్ రౌండర్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. బౌలింగ్లో 5 వికెట్లు తీసిన అతను బ్యాటింగ్లోనూ మెప్పించాడు. అద్భుతమైన ఫుట్వర్క్తో కమిన్స్, బోలండ్, లియాన్, మర్ఫీలను ఎదుర్కొన్నాడు.