మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో మ్యాచ్ ఆలస్యం అవుతోంది. గురువారం నాడు నాగ్పూర్లో భారీ వర్షం కురవడంతో ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్స్ కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మ్యాచ్కు ముందు మైదానం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో అంపైర్లు టాస్ ఆలస్యం చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా.. చిత్తడి అవుట్ఫీల్డ్ కారణంగా టాస్ వేయలేదు. అరగంట ఆలస్యంగా 7 గంటలకు మరోసారి మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు కేఎన్ అనంత పద్మనాభన్, నితిన్ మీనన్.. అవుట్ ఫీల్డ్ పరిస్థితి చూసి మరింత టైం పడుతుందని చెప్పారు. దీంతో 8 గంటలకు మరోసారి పిచ్ పరిశీలించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ కారణంగా మ్యాచ్ మరింత ఆలస్యం అవనుంది.
Next inspection at 8 PM IST.#INDvAUS https://t.co/mxqSmLaxYm
— BCCI (@BCCI) September 23, 2022