ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. 187 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన భారత్ను డానియల్ శామ్స్ తొలి ఓవర్లోనే దెబ్బతీశాడు. శామ్స్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన రాహుల్.. కీపర్ వేడ్కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు తొలి ఓవర్లోనే కీలకమైన వికెట్ కోల్పోయి 5/1 స్కోరుతో నిలిచింది. అంతకుముందు టిమ్ డేవిడ్ (54), కామెరూన్ గ్రీన్ (52) ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 186/7 స్కోరు సాధించిన సంగతి తెలిసిందే.