ఎన్నాళ్లకెన్నాళ్లకు.. స్టార్ బ్యాటర్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు తీరాయి. ఫామ్లోకి వస్తున్న ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లంతా టెస్టు క్రికెట్లో సెంచరీలు చేస్తుంటే.. విరాట్ తన రూటే సపరేటు అని మరోసారి నిరూపించాడు. నెలరోజుల విశ్రాంతి తర్వాత అదిరిపోయే ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన కోహ్లీ.. అఫ్ఘానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడేళ్ల పాటు అతని సెంచరీ కోసం ఎదురు చూసిన అభిమానులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు.
రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్గా వచ్చిన అతను సెంచరీ (105 నాటౌట్)తో అదరగొట్టాడు. రాహుల్ (62)తో కలిసి జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించిన అతను.. ఆ తర్వాత పంత్ (19 నాటౌట్)ను ఒక ఎండ్లో నిలబెట్టి మరో ఎండ్లో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో నెట్టింట కోహ్లీ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
There it is! 💯 for @imVkohli 👏👏
His first in T20Is and 71st in International Cricket.
Live – https://t.co/1UkuWxy3Ee #INDvAFG #AsiaCup2022 pic.twitter.com/2Yeakk1oLc
— BCCI (@BCCI) September 8, 2022