రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో జట్టుకు సారధ్యం వహిస్తున్న స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (26 నాటౌట్) టీమిండియాకు మంచి ఆరంభం ఇచ్చాడు. అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు విరాట్ కోహ్లీ (25 నాటౌట్)తో కలిసి నిలకడైన ఆరంభం అందించాడు. ముఖ్యంగా కోహ్లీ పవర్ప్లే చివరి ఓవర్లో అద్భుతంగా ఆడాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 52 పరుగులు చేసింది.