ఆసియా కప్ నుంచి పూర్తిగా తప్పుకున్న భారత జట్టు నామమాత్రపు మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో యువ బ్యాటర్ రిషభ్ పంత్ను పక్కనపెట్టే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయని మాజీ స్టార్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. ‘ఈ మ్యాచ్లో ఫినిషర్గా దినేస్ కార్తీక్ ఆడతాడని అనిపిస్తోంది. హార్దిక్, డీకే ఇద్దరూ ఫినిషర్లుగా ఆడతారు.
అలాగే పంత్ను పక్కనపెట్టి దీపక్ హుడాను ఐదో స్థానంలో పంపుతారని అనుకుంటున్నా’ అని ఊతప్ప చెప్పాడు. అలాగే బౌలింగ్ విభాగంలో దీపక్ చాహర్ను తీసుకునే ఛాన్స్ ఉందని, విశ్రాంతి తర్వాత అతను జింబాబ్వేలో బాగానే రాణించాడని గుర్తుచేశాడు.
అదే సమయంలో అక్షర్ పటేల్ను ఆడించే అవకాశం కూడా ఉందని, అయితే అతన్ని ఆడిస్తారా? లేదా అనేది టీం మేనేజ్మెంట్ చేతుల్లో ఉందని తేల్చేశాడు. అప్పుడు హుడా, పంత్ ఇద్దరూ బెంచ్కే పరిమితం అవుతారన్నాడు. మరి ఈ మ్యాచ్లో భారత జట్టు ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.