న్యూఢిల్లీ: వన్ డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బుధవారం భారత్-అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:00 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్టీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై గెలిచి మాంచి ఊపు మీదుండగా.. తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైన అఫ్ఘాన్ టీమ్ భారత్పై సంచలనం నమోదు చేయాలని భావిస్తోంది.
కాగా, ఈ ప్రపంచకప్లో ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్లు జరిగాయి. ఇవాళ జరిగేది 9వ మ్యాచ్. ఆడిన రెండేసి మ్యాచ్లు గెలిచిన న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు నాలుగేసి పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో తొలి రెండు స్థానాలను ఆక్రమించాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి రెండేసి పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, బంగ్లాదేశ్ టీమ్లు ఒక్కో విజయం, ఒక్కో ఓటమితో రెండేసి పాయింట్లు సాధించి ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్ ఆడిన ఒక్కో మ్యాచ్ ఓడిపోయి.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు రెండేసి మ్యాచ్ల చొప్పున ఓడిపోయి ఇంకా ఖాతా తెరువలేదు.