భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్లో అంపైర్లు ఓవర్లు కుదించారు. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆలస్యమైన ఈ మ్యాచ్ 9.30 గంటలకు ప్రారంభం అవుతుందని అంపైర్లు ప్రకటించారు. అలాగే ఇన్నింగ్స్ 8వ ఓవర్లకు కుదించాలని కూడా నిర్ణయించారు. రెండు జట్ల కెప్టెన్లతో సంప్రదింపుల అనంతరం మ్యాచ్ను చెరో 8 ఓవర్లకు కుదించినట్లు ప్రకటించారు.
టాస్ 9.15 గంటలకు ఉంటుందని, మ్యాచ్ 9.30 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా నాగ్పూర్ పిచ్ చిత్తడిగా తయారైంది. ఈ క్రమంలో మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అవుట్ ఫీల్డ్ ఇంకా చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యమైంది. ముఖ్యంగా వైడ్ మిడాన్ వద్ద నేల బాగా చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ బాగా ఆలస్యమైంది.