అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39-37 తేడాతో యూ ముంబైపై అద్భుత విజయం సాధించింది. యువ రైడర్ సోను జగ్లాన్ 11 పాయింట్లతో గుజరాత్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
కెప్టెన్గా వందో మ్యాచ్ ఆడుతున్న ఫజల్ అత్రాచలీ ఐదు పాయింట్లతో ఆకట్టుకోగా, రాకేశ్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ముంబా తరఫున గుమన్సింగ్ (10), జఫర్దనేశ్ (10) రాణించినా..జట్టును గెలిపించలేకపోయారు.