కౌలాలాంపూర్: పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత్కు నిరాశ తప్పలేదు. శనివారం కాంస్య పతక పోరులో భారత్ 1-3తో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైంది. భారత్ తరఫున సునీల్ జోజో (28వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా.. స్పెయిన్ తరఫున నికోలస్ అల్వరెజ్ (25వ, 51వ. ని.ల్లో), పాచెమ్ పా (40వ ని.లో) గోల్స్ కొట్టారు.
లీగ్ స్టేజ్లో స్పెయిన్ చేతిలో పరాజయం పాలైన భారత్.. కీలక పోరులోనూ సత్తాచాటలేకపోయింది.