తిరువనంతపురం : స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇవ్వడంతో తనకు తెలిసిన అన్ని షాట్లను ప్రదర్శిస్తున్నానని, నిర్భయంగా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని పరుగులు రాబడుతున్నానని టీమ్ఇండియా ఓపెనర్ జైస్వాల్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20ల్లో యశస్వి 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు సాధించి, రుతురాజ్తో కలిసి తొలి వికెట్కు 77 పరుగులు జోడించిన వైనమే యశస్వి తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది.