ఇస్లామాబాద్: ఐపీఎల్లో పాక్ క్రికెటర్ల(Pakistan cricketers)ను ఆడనివ్వకపోవడం పట్ల పాక్ మాజీ క్రికెటర్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) స్పందించారు. ఐపీఎల్(IPL)లో పాక్ క్రికెటర్లకు ఛాన్సు ఇవ్వకపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టైమ్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాస్తవానికి 2008 ఐపీఎల్ ఎడిషన్లో పాక్ క్రికెటర్లు ఆడారు. కానీ ముంబై దాడుల తర్వాత ఆ దేశ క్రికెటర్లను ఐపీఎల్కు ఎంపిక చేయడం లేదు.
బీసీసీఐ చాలా దురుసుగా, అహంకారంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఒకవేళ పాక్ క్రికెటర్లను ఆడనివ్వకుంటే, దాంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కువ మొత్తంలో నిధులను బీసీసీఐ(BCCI) రాబడుతోందని, అందుకే ఆ బోర్డు ఆహంకారంతో వ్యవహరిస్తున్నట్లు ఇమ్రాన్ ఆరోపించారు. ఇండియా, పాక్ మధ్య క్రికెట్ రిలేషన్షిప్ చెడిపోవడం దురదృష్టకరమన్నారు.