అహ్మదాబాద్: ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. కాగా, ఈ మ్యాచ్ కోసం రెండు టీమ్ల కెప్టెన్లు తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీఫైనల్లలో ఆడిన జట్లతోనే రంగంలోకి దిగారు.
భారత్ (Playing XI) : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా (Playing XI) : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెల్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిష్ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్.