మెల్బోర్న్: ఐసీసీ టీ20 జట్టులో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. మెగాటోర్నీ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ను సోమవారం ప్రకటించింది. నాలుగు అర్ధసెంచరీలతో 98.66 సగటుతో కోహ్లీ(296) టాప్స్కోరర్గా నిలిచాడు. సూర్యకుమార్ మూడు అర్ధసెంచరీలతో 239 పరుగులు సాధించాడు. వీరితో పాటు టీమ్ఇండియా నుంచి హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు.