PAK Vs ZIM : టీ20 వరల్డ్కప్లో భాగంగా గురువారం గ్రూప్-2లో పాకిస్థాన్-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ రేపింది. ఆఖరి బంతివరకు ఫలితం తేలని ఈ మ్యాచ్లో జింబాబ్వే పాకిస్థాన్కు షాకిచ్చింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసి కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
జింబాబ్వే తన అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్ను సొంతం చేసుకుంది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో షాన్ మసూద్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలువగా.. మహ్మద్ నవాజ్ 22 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా 3, బ్రాడ్ ఎవన్స్ 2 వికెట్లు తీశారు. పాక్ మూలాలున్న సికిందర్ రజా ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ను దెబ్బకొట్టాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలువగా, చివర్లో బ్రాడ్ ఎవన్స్ 19 మెరుపులు మెరిపించాడు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ వసీమ్ 4, షాదాబ్ ఖాన్ 3 వికెట్లు, హరీన్ రౌఫ్ ఒక వికెట్ తీశారు.