న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ)కి కాసుల వర్షం కురియనుంది. ఐసీసీ నుంచి ఇక పై ప్రతి ఏటా పెద్ద మొత్తంలో మన బోర్డు ఆదాయాన్ని అందుకోనుంది. కొత్త రెవెన్యూ మోడల్కు ఐసీసీ సర్వసభ్య సమావేశంలో ఆమోదం లభించడంతో.. బీసీసీఐ వాటా 72 శాతం పెరిగింది.
దీంతో ఏడాదికి సుమారు రూ. 2 వేల కోట్లు (231 మిలియన్ డాలర్లు) భారత బోర్డుకు దక్కనుంది. ఐసీసీకి భారీగా ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న బీసీసీఐ.. కొత్త రెవెన్యూ విధానం ప్రకారం ఐసీసీ నుంచి 38.5 శాతం వాటా దక్కించుకోనుంది.