ODI WC 2023 : ఈ ఏడాది వన్డే ప్రపంచకప్కు ఏడు జట్లు క్వాలిఫై అయ్యాయి. ఆఖరి స్థానం కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ మెగా టోర్నమెంట్కు క్వాలిఫై అయిన జట్ల వివరాలను ఐసీసీ ఈ రోజు వెల్లడించింది. సూపర్ లీగ్(ICC Mens World Cup Super League)లో టాప్ -7 లో నిలిచిన టీమ్స్ నేరుగా వరల్డ్ కప్ టోర్నీకి క్వాలిఫై అయ్యాయి. వాటిలో న్యూజిలాండ్ 165 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
ఇంగ్లండ్ (155 పాయింట్లు), భారత్(139 పాయింట్లు), బంగ్లాదేశ్(130 పాయింట్లు) వరుసగా రెండ, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్(130 పాయింట్లు) ఐదో ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా 120 పాయింట్లతో ఆరో ప్లేస్లో, అఫ్గనిస్థాన్(115 పాయింట్లు)తో ఏడో స్థానంలో నిలిచి వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించాయి.
ఆఖరి క్వాలిఫయర్ కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్(88 పాయింట్లు), తొమ్మదో స్థానంలో ఉన్న శ్రీలంక(81 పాయింట్లు), పదో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా(78 పాయింట్లు), 11వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ (68 పాయింట్లు) టీమ్స్ పోటీ పడుతున్నాయి. న్యూజిలాండ్పై న్డే సిరీస్ గెలిచి వరల్డ్ కప్కు క్వాలిఫై అవ్వాలనుకున్న శ్రీలంక తొలి వన్డేలో చిత్తుగా ఓడిపోయింది. రెండో వన్డేలో విజయంపై కన్నేసిన ఆ జట్టుకు వరుణుడు షాకిచ్చాడు. దాంతో, ఈ నాలుగు జట్లలో 8వ క్వాలిఫయర్ ఎవరు? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
The race for the final direct qualification spot in the @MRFWorldwide #CWCSL standings is heating up 🔥
More 👉 https://t.co/XtrjdVQi2P pic.twitter.com/fkQMBDfVDX
— ICC (@ICC) March 28, 2023
ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ సమరానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ – నబంబర్ మధ్య ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. స్వదేశంలో 2011లో వరల్డ్ కప్ను టీమిండియా సొంతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ధోనీ సేన రెండో సారి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో శ్రీలంకపై సిక్సర్తో తన స్టయిల్లో మ్యాచ్ ముగించడంతో భారత అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అప్పటి నుంచి భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. దాంతో, సొంతగడ్డపై మరోసారి కప్పు కొట్టాలని టీమిండయా ఉవ్విళ్లూరుతోంది.