అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల క్రికెట్కు సంబంధించి వచ్చే నాలుగేండ్లలో ఆడబోయే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)ను తాజాగా ప్రకటించింది. 2023-2027 కాలానికి గాను అంతర్జాతీయంగా వివిధ జట్లు ఆడే టూర్ల షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది. గతంతో పోలిస్తే కొత్త ఎఫ్టీపీలో అన్ని ఫార్మాట్ల మ్యాచ్ల సంఖ్యలు గణనీయంగా పెరగడం గమనార్హం.
2019-23 FTPలో అన్ని జట్లు కలిపి 151 టెస్టులు, 241 వన్డేలు, 301 టీ20లు ఆడాల్సి ఉండగా.. 2023-27లో వీటి సంఖ్య మరింత పెంచింది ఐసీసీ. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నాలుగేండ్ల కాలంలో 173 టెస్టులు, 281 వన్డేలు, 326 టీ20లు ఉన్నాయి. మొత్తంగా.. నాలుగేండ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతాయి.
అంటే గతంతో పోలిస్తే ఈ సైకిల్లో పురుషుల క్రికెట్ జట్లు.. 87 మ్యాచ్లు ఎక్కువ ఆడాల్సి ఉంది. ఇక ఈ నాలుగేండ్లలోనే ఒక వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 ప్రపంచకప్లు, రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ కూడా జరుగనున్నాయి.
ఇక భారత్ విషయానికొస్తే.. 2023-25 కాలంలో రోహిత్ శర్మ అండ్ కో.. స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్లతో టెస్టులు ఆడుతుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లనుంది. 2025-27 సైకిల్లో ఆసీస్, విండీస్, సౌతాఫ్రికాలు భారత పర్యటనకు వస్తాయి. భారత్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, సఫారీ పర్యటనలకు వెళ్లనుంది.
Men’s Future Tour Program for 2023-27 announced 📢
Details 👇https://t.co/33MN4USU6L
— ICC (@ICC) August 17, 2022