న్యూజిల్యాండ్, భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్ తర్వాత విడుదలైన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగుపరుచుకొని ఐదో ర్యాంకులో నిలిచాడు. ఈ సిరీస్ రెండో మ్యాచులో 65 పరుగులు చేసిన రాహుల్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
పాక్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ రిజ్వాన్ కూడా ఒక స్థానం మెరుగుపరుచుకొని నాలుగో స్థానానికి చేరాడు. వీరిద్దరి మధ్య కేవలం ఆరు రేటింగ్ పాయింట్ల తేడానే ఉండటం గమనార్హం. కివీస్తో సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగై 13వ ర్యాంకులో నిలిచాడు.
ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిల్యాండ్తో సిరీస్ ఆడని విరాట్ కోహ్లీ.. టాప్టెన్ బ్యాట్స్మెన్ జాబితాలో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం కోహ్లీ 11వ ర్యాంకులో నిలిచాడు.
ఇదే సిరీస్లో రాణించిన కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ పదిస్థానాలు మెరుగై 13వ ర్యాంకుకు చేరాడు. టీమిండియా పేసర్ భువనేశ్వకు కూడా ఐదు స్థానాలు మెరుగుపరచుకొని 19వ స్థానంలో నిలిచాడు.