Champions Trophy | ఇంగ్లండ్ క్రికెట్ టీమ్కు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) షాక్ ఇచ్చింది. 2025లో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ట్రోఫీకి సంబంధించిన అర్హత ప్రమాణాలపై ఐసీసీ కీలక సమాచారం అందించింది. వరల్డ్ కప్-2023 లీగ్ దశ తర్వాత టాప్లో నిలిచే ఏడు జట్లను మాత్రమే ఈ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయని ప్రకటించింది. టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగుతాయని పేర్కొంది. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో పది జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో లీగ్లో దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే సెమీ ఫైనల్కు వెళ్తాయి. అయితే, వరల్డ్ కప్ లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో తొలి ఏడు స్థానాల్లో నిలిచిన జట్లు చాంఫియన్స్ ట్రోఫీకి అర్హత సాధించనుండగా.. ఆతిథ్య పాక్ జట్టుతో కలిసి ఎనిమిది జట్లు ట్రోఫీలో ఆడనున్నాయి. 2025 చాంఫియన్స్ ట్రోఫీ క్వాలిఫికేషన్ సిస్టమ్ను 2021లో ఐసీసీ బోర్డు ఆమోదించిందని ఐసీసీ ప్రతినిధి క్రికెట్ ఇన్ఫోకి తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీని చివరిసారిగా 2017లో నిర్వహించగా.. భారత్ను ఓడించి పాక్ టైటిల్ను సొంతం చేసుకున్నది.
ఐసీసీ నిబంధనల ప్రకారం వరల్డ్ కప్లో టాప్-7లో నిలిచిన జట్లకు మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే ఇంగ్లండ్ వంటి బలమైన జట్లు సైతం టోర్నీకి దూరమయ్యే ఛాన్స్ ఉన్నది. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచప్ కప్లో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శనతో పదో స్థానానికి పరిమితమైంది. లక్కీగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఛాంపియన్స్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉన్నది. ఆఫ్ఘన్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్నది. వరల్డ్ కప్లో గ్రూప్ రౌండ్ మ్యాచ్లు ముగిసిన తర్వాత ఏయే జట్లు తొలి ఏడు స్థానాల్లో నిలుస్తాయో చూడాల్సిందే. అయితే, ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై వెస్టిండ్, జింబాబ్వే, ఐర్లాండ్ తదితర సభ్యదేశాలు పెదవి విరుస్తున్నాయి. ఇప్పటికే ఐసీసీ సభ్యత్వం ఈ దేశాలు ఇప్పటికే ప్రపంచకప్కి అర్హత సాధించలేకపోయాయి. ఆయా దేశాలకు ఆడే అవకాశం లేకపోవడంతో ట్రోఫీని కోల్పోతామంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనల విషయంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ అసంతృప్తిని వెళ్లగక్కాయి. అయితే, వరల్డ్కప్ లీగ్ దశ అనంతరం ఆతిథ్య పాక్ జట్టు టాప్-7 జట్లలో ఉంటే.. ఎనిమిదో స్థానానికి ఏ జట్టును ఏ ప్రతిపాదికన ఎంపిక చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
ఐసీసీ నవంబర్ 2021లో ఐసీసీ కొత్త సైకిల్ను(2024-2031) ప్రకటించింది. ఇందులో పురుషుల క్రికెట్తో పాటు మహిళల క్రికెట్కు సంబంధించిన ఈవెంట్స్పై ప్రకటించింది. ఇందులో 2025, 2029లో ఛాంపియన్స్ ట్రోఫీ రెండు ఎడిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా.. నాలుగు చొప్పున జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపుల్లో తొలి స్థానాల్లో నిలిచి జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. అందులో గెలుపొందిన జట్లు ఫైనల్కు చేరుతాయి. వాస్తవానికి గతంలో ఐసీసీ ర్యాకింగ్స్ ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీకి జట్లను ఎంపిక చేసే విధానం ఉండేంది. 2013, 2017 ఎడిషన్ల కటాఫ్ తేదీలో వన్డే ర్యాంకింగ్స్లో తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీకి చేయగా.. 2025 ఎడిషన్ ట్రోఫీకి ప్రపంచకప్లో గ్రూప్ దశ పూర్తయ్యే సరికి టాప్-7లో ఉన్న జట్లు మాత్రమే క్వాలిఫై కానున్నాయి. ఈ ప్రతిపాదనను ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించి సిఫారసు చేయగా.. ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపింది.