దుబాయ్: క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగాటోర్నీ సిద్ధమైంది. మొన్నటి వరకు ఐపీఎల్ హంగామాలో మునిగి తేలిన అభిమానులు ఇక టీ20 ప్రపంచకప్ను ఆస్వాదించనున్నారు. ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. కరోనా కారణంగా వేదికను యూఏఈ, ఓమన్కు తరలించారు. ఈ మెగాటోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా.. నేటి నుంచి క్వాలిఫయర్ జట్ల మధ్య పోటీలు జరుగనున్నాయి. ఆదివారం జరుగనున్న మ్యాచ్ల్లో పపువా న్యూ గినియాతో ఓమన్, స్కాట్లాండ్తో బంగ్లాదేశ్ తలపడనున్నాయి. అక్టోబర్ 23 నుంచి ప్రధాన జట్ల పోటీలు ప్రారంభం కానుండగా.. టీమ్ఇండియా తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది.