Wanindu Hasaranga : శ్రీలంక టీ20 సారథి వనిందు హసరంగ(Wanindu Hasaranga)కు పెద్ద షాక్ తగిలింది. అంపైర్తో అనుచిత ప్రవర్తన కారణంగా అతడిపై రెండు మ్యాచ్ల నిషేధం పడింది. అఫ్గనిస్థాన్తో స్వదేశంలో ఈ మధ్యే ముగిసిన టీ20 సిరీస్లో హసరంగ.. అంపైర్ లిండన్ హనిబల్(Lyndon Hanibal) తీరును తప్పుబట్టాడు.
దంబుల్లాలో జరిగిన మూడో టీ20లో అఫ్గనిస్థాన్ 209 రన్స్ కొట్టింది. అనంతరం శ్రీలంక ఇన్నింగ్స్లో నడుము ఎత్తులో వచ్చిన బంతిని లిండన్ నోబాల్గా ప్రకటించలేదు. దాంతో, తీవ్ర అసహనానికి గురైన హసరంగ నోటికి పని చెప్పాడు. అంపైరింగ్ చేతకాకుంటే మరేదైనా పని చేసుకోవచ్చుగా అని అన్నాడు. అతడి మాటల్ని సీరియస్గా తీసుకున్న మ్యాచ్ రిఫరీఐసీసీకి ఫిర్యాదు చేశాడు. దాంతో, ఈ ఆల్రౌండర్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత వేయడమే కాకుండా మూడు డీ మెరిట్ పాయింట్లు విధించారు.
Sri Lanka star handed two-match suspension for breaching ICC Code of Conduct.https://t.co/eWyf4kybza
— ICC (@ICC) February 24, 2024
తద్వారా హసరంగపై ఉన్న డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరింది. రెండేండ్ల వ్యవధిలో ఓ క్రికెటర్పై ఐదు పాయింట్లు నమోదైతే ఐసీసీ నియమావళి ప్రకారం నిషేధం విధిస్తారు. అందుకనే హసరంగపై రెండు టీ20ల నిషేధం విధించారు. అదే మ్యాచ్లో ఐసీసీ రూల్స్ను అతిక్రమించిన అఫ్గనిస్థాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్జాజ్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.