దుబాయ్: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో అక్టోబర్ 23న మెల్బోర్న్లో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు స్టాండింగ్ రూం టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్టు ఐసీసీ వెల్లడించింది. సీటింగ్ టిక్కెట్లు ఫిబ్రవరిలో అమ్మకానికి పెట్టిన అయిదు నిమిషాలలోనే అయిపోయాయని, ఇపుడు అందుబాటులో ఉన్న 4 వేల స్టాండింగ్ రూం టిక్కెట్లను ముందు వచ్చినవారికి ముందు క్రమంలో విక్రయించనున్నట్టు తెలిపింది.