Cricket World cup | దుబాయ్: వన్డే ప్రపంచకప్ విజేతకు రూ.33 కోట్ల నగదు బహుమతి అందించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. భారత్ వేదికగా వచ్చే నెల 5 నుంచి జరుగనున్న వరల్డ్కప్లో పాల్గొనే జట్లకు ఇచ్చే ప్రైజ్మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం వెల్లడించింది.
విజేతకు రూ. 33 కోట్లు (4 మిలియన్ డాలర్లు), రన్నరప్నకు రూ.16 కోట్లు (2 మిలియన్ డాలర్లు) అందించనున్నారు. సెమీఫైనల్లో ఓడిన జట్లకు ఆరేసి కోట్లు దక్కనున్నాయి.. నాకౌట్ చేరకుండా వెనుదిరిగిన ఒక్కో జట్టుకు రూ. 82 లక్షలు ముట్టనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.