Ashes Tests | దుబాయ్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్పై ఐసీసీ చర్యలకు పూనుకుంది. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా పాయింట్లలో కోత విధించడంతో పాటు ఆసీస్, ఇంగ్లండ్కు జరిమానా వేసింది. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ‘మారిన నిబంధనల ప్రకారం ఒక్కో తక్కువ ఓవర్కు ఒక డబ్ల్యూటీసీ పాయింట్తో పాటు మ్యాచ్ ఫీజలో ఐదు శాతం జరిమానా పడుతుంది’ అని ఐసీసీ స్పష్టం చేసింది.
యాషెస్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్లు జరిగాయి. ఇందులో స్లో ఓవర్రేట్ కారణంగా ఆసీస్పై 10 పాయింట్లు, ఇంగ్లండ్పై 19 పాయింట్ల కోత పడింది. శ్రీలంకపై సిరీస్ విజయంతో పాకిస్థాన్ 24 పాయింట్లతో టాప్లో కొనసాగుతుండగా, భారత్ (16) రెండో స్థానంలో ఉంది.