బెంగళూరు: వన్డే క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్-నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డు బద్దలు కానుంది. వన్డే క్రికెట్లో 50 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా కోహ్లీ పేరిట అత్యంత అరుదైన రికార్డు నమోదు కానుంది.
సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్లో 49 సెంచరీలు చేశాడు. గత మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదడం ద్వారా సచిన్ రికార్డును సమం చేశాడు. ఇవాళ్టి మ్యాచ్లో కూడా సెంచరీ చేస్తే ఆ రికార్డు బ్రేక్ కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ 49 సెంచరీలకు ప్రతీకగా అభిమానులు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర 49 కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ల ముందు సింగిల్గా, గ్రూపులుగా ఫొటోలు దిగుతూ క్రికెట్ ప్రేమికులు సందడి చేస్తున్నారు.
కోహ్లీ కటౌట్ల కోసం చేసిన ఫొటోల ఎంపికలో ఆయన అభిమానులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లుగా కనిపిస్తున్నది. మొదటి సెంచరీ నుంచి 49వ సెంచరీ వరకు.. ఏ సెంచరీకి సంబంధించిన ఫొటోను ఆ సెంచరీ కటౌట్గా తీసుకున్నారు. ఆయా సెంచరీలు బాదిన సందర్భంగా కోహ్లీ అభిమానులకు అభివాదం చేసినవి, లేదంటే తనదైన స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను కటౌట్లుగా ఎంచుకున్నారు.
#WATCH | Karnataka: ICC Men’s Cricket World Cup | Ahead of India Vs Netherlands, 49 cut-outs of Indian cricketer Virat Kohli showing his 49 centuries, put up at M Chinnaswamy Stadium in Bengaluru. pic.twitter.com/ixA4dy2J6n
— ANI (@ANI) November 12, 2023