IND vs NZ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. గ్రూప్-Aలో ఇది ఆఖరి లీగ్ మ్యాచ్. రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుని ఉన్నాయి. ఇరు జట్లూ తొలి రెండేసి లీగ్ మ్యాచ్లలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లను ఓడించాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు గ్రూప్ టాపర్గా నిలువనుంది.
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ : విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూక్.