దుబాయ్: మెన్స్ టీ20 వరల్డ్కప్( T20 World Cup ) విజేత, రన్నరప్ టీమ్స్కు ఇచ్చే ప్రైజ్మనీని ఆదివారం ప్రకటించింది ఐసీసీ. విజేతకు 16 లక్షల డాలర్లు (సుమారు రూ.12.02 కోట్లు), రన్నరప్కు అందులో సగం అంటే 8 లక్షల డాలర్లు (సుమారు రూ.6 కోట్లు) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ టోర్నీ మొత్తానికి 56 లక్షల డాలర్లు (సుమారు రూ.42.07 కోట్లు) ప్రైజ్మనీగా ఇవ్వనున్నారు. ఈ మొత్తంలో టోర్నీలో పాల్గొనే 16 జట్లు ఎంతో కొంత మొత్తాన్ని అందుకోనున్నాయి.
సెమీఫైనల్లో ఓడిపోయే రెండు టీమ్స్లో ఒక్కోదానికి 4 లక్షల డాలర్లు (సుమారు రూ.3 కోట్లు) ఇవ్వనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటన తెలిపింది. ఈసారి ఈగ్ స్టేజ్లో మొత్తం 30 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ మ్యాచ్ గెలిచే టీమ్కు 40 వేల డాలర్లు ఇవ్వనున్నారు. ఆ లెక్కన లీగ్ స్టేజ్ మొత్తం ప్రైజ్మనీ 12 లక్షల డాలర్లకు చేరనుంది. సూపర్ 12 స్టేజ్లో పాల్గొనే వాటిలో 8 టీమ్స్ ఖరారయ్యాయి. మిగతా నాలుగు టీమ్స్ ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే అర్హత మ్యాచ్ల ద్వారా క్వాలిఫై అవుతాయి.
ఇక లీగ్ స్టేజ్లోనే ముగిసే సూపర్ 12లోని టీమ్స్ ఒక్కోదానికి 70 వేల డాలర్లు ఇస్తారు. టోర్నీ తొలి రౌండ్లో భాగంగా జరిగే అర్హత మ్యాచ్లలో బంగ్లాదేశ్, ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, ఒమన్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, శ్రీలంక పాల్గొననున్నాయి. ఇక ఒక్కో మ్యాచ్లో రెండు డ్రింక్స్ బ్రేక్స్ ఉండనున్నాయి. ఇన్నింగ్స్ మధ్యలో రెండున్నర నిమిషాలు పాటు ఈ బ్రేక్ ఉంటుంది.