న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్కు స్పిన్నర్ అశ్విన్ ఇవాళ గుడ్బై చెప్పాడు. రిటైర్మెంట్ ప్రకటించిన ఆ స్టార్ స్పిన్నర్పై మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పందించాడు. 14 ఏళ్ల నీతో కలిసి ఆడానని, రిటైర్ అవుతున్నట్లు ఇవాళ చెప్పగానే కాస్త భావోద్వేగానికి లోనైట్లు విరాట్ పేర్కొన్నాడు. తన ట్విట్టర్లో అతను స్పందించాడు. నీతో కలిసి ఆడిన ఆ క్షణాలన్నీ గుర్తు వచ్చినట్లు చెప్పాడు. నీతో సాగిన జర్నీలో ప్రతి సందర్భాన్ని ఎంజాయ్ చేసినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. నీ నైపుణ్యం, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాన్నిఅద్భుతమని తెలిపాడు. భారత క్రికెట్లో నిన్నొక లెజెండ్గా గుర్తిస్తారన్నాడు. నీకు, నీకు కటుంబానికి బెస్ట్ విషెస్ చెబుతున్నట్లు కోహ్లీ తెలిపాడు.
I’ve played with you for 14 years and when you told me today you’re retiring, it made me a bit emotional and the flashbacks of all those years playing together came to me. I’ve enjoyed every bit of the journey with you ash, your skill and match winning contributions to Indian… pic.twitter.com/QGQ2Z7pAgc
— Virat Kohli (@imVkohli) December 18, 2024
బ్రిస్బేన్ టెస్టు చివరి క్షణాల్లో.. కోహ్లీ, అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్లో కలిసి కూర్చున్నారు. మ్యాచ్ డ్రా అయినట్లు ప్రకటించగానే.. అశ్విన్ను కోహ్లీ హత్తుకున్నాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. 106 టెస్టుల్లో 537 వికెట్లు తీసుకున్నాడు అశ్విన్. 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు తీసుకున్నాడతను. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో వన్డేతో అరంగేట్రం చేశాడు.