న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. కేంద్ర హోంశాఖ ఆధీనంలో విధులు నిర్వర్తించే ఢిల్లీ పోలీసు శాఖ ఈ కేసులు బుక్ చేసింది. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మేటి రెజ్లర్లు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భజరంగ్ పూనియా, సాక్షీ మాలిక్, వినోశ్ పోగట్లు గత వారం రోజుల నుంచి ధర్నాలో పాల్గొన్నారు. మైనర్ను లైంగికంగా వేధించినట్లు ఓ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పోక్సో చట్టం ప్రకారం ఆ కేసు బుక్ చేశారు. దాంట్లో బెయిల్ రావడం కష్టమే.
ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ స్పందించారు. తనకు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ అందలేదన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.. ఎఫ్ఐఆర్ కాపీ అందిన తర్వాత తాను మాట్లాడనున్నట్లు బ్రిజ్ భూషణ్ వెల్లడించారు. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్.. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు. న్యాయవ్యవస్థ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉందని, తనపై వచ్చిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు విచారిస్తారని, అన్ని అంశాల్లో సహకరిస్తానన్నారు. తానేమీ సుప్రీంకోర్టు కన్నా పెద్దగా కాదు అని, ఆ ఆర్డర్ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
#WATCH | "I have not yet received the FIR copy. I will speak once I've received the FIR copy," says Brijbhushan Sharan Singh, President, Wrestling Federation of India on wrestlers' protest against him and FIRs registered by Delhi police pic.twitter.com/FvU1FxkI35
— ANI (@ANI) April 29, 2023