Ishan Kishan : బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు యువ ఓపెనర్ ఇషాన్ కిషాన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే మ్యాచ్ అనంతరం ఇషాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు తాను ఒకవేళ ఔట్ కాకపోయి ఉంటే ట్రిపుల్ సెంచరీ చేసేవాడినేమో అని అతను అన్నాడు. ‘డబుల్ సెంచరీ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే.. నేను అవుట్ అయ్యే సరికి ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ నేను అవుట్ కాకుంటే ట్రిపుల్ సెంచరీ కొట్టేవాడినేమో’ అని యువ ఓపెనర్ తెలిపాడు. తస్కిన్ బౌలింగ్లో బౌండరీ వద్ద లిట్టన్ దాస్ క్యాచ్ పట్టడంతో ఇషాన్ విరోచిత ఇన్నింగ్స్కు తెరపడింది. అతను 131 బంతుల్లో 210 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జట్టు 409 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు.
డబుల్ సెంచరీ చేసిన ఏడో ఆటగాడిగా ఇషాన్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు భారత్ తరఫున ద్విశతకం చేసిన నాలుగో బ్యాటర్గా ఇషాన్ మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ ఈ మ్యాచ్లో వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడి డబుల్ సెంచరీ కొట్టాడు. అందులో 10 సిక్సర్లు, 24 ఫోర్లు ఉన్నాయంటే అతని విధ్యంసం ఎంతలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అతని ఇన్నింగ్స్ చూసిన వాళ్లంతా కచ్చితంగా ట్రిపుల్ సెంచరీ చేస్తాడని అనుకున్నారు.