Virat Kohli | శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీ (Asia Cup 2023)లో భారత్, పాకిస్థాన్(India Vs Pakistan) మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. వర్షం ఎంతసేపటికి ఆగకపోవడంతో రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన పాకిస్థాన్ యువతి (Pakistani Fan) విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకుంది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్లోను అభిమానులు ఉన్నారు. అయితే ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్ , పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు పాకిస్థాన్ యువతి వచ్చింది. కాగా.. ఈ మ్యాచ్లో విరాట్ నాలుగు పరుగులకే ఔటయ్యాడు. దీంతో నిరాశ చేందిన యువతి మీడియా ముందు తన బాధ చెప్పుకుంది.
“విరాట్ కోసమే నేను ఈ మ్యాచ్ కి వచ్చాను. కోహ్లీ సెంచరీ చేయకపోవడంతో నిరాశ చెందా. విరాట్ నా మనసు గాయపరిచాడు. నాకు భారత్ , పాకిస్తాన్ రెండు ఒకటే. బాబర్, కోహ్లీలలో ఫేవరెట్ ఎవరంటే కోహ్లీ అనే చెబుతా అని” ఆ యువతి తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
A Pakistan fan came for Virat Kohli said:
“I came only for Virat Kohli, I expected a century from him. My heart is broken”. pic.twitter.com/PTbfhuOT9d
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2023
ఇదిలా ఉండగా.. తొలుత భారత్ బ్యాటింగ్ చేసి పాక్ ముంగిట 267 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించినా.. తర్వాత వర్షం ఆగక పోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.