కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడవ టెస్టులో ఆడేందుకు ఫిట్గా ఉన్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. రెండవ టెస్టుకు మిస్ అయిన కోహ్లీ.. ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేప్ టౌన్ వేదికగా రేపటి నుంచి మూడవ టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. అయితే మూడవ టెస్టుకు ఫిట్గా ఉన్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. గాయపడ్డ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మూడవ టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. తొడకండరాలతో సిరాజ్ ఇబ్బందిపడుతున్నాడని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని, అతను మ్యాచ్కు రెఢీగా లేడని భావిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. న్యూలాండ్స్ మైదానంలో ఇప్పటి వరకు ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య అయిదు టెస్టులు జరిగాయి. అక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఇండియా గెలవలేదు.