హైదరాబాద్, ఆట ప్రతినిధి: థాయ్లాండ్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూ25కే టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ యువ ప్లేయర్ యమ్లపల్లి సహజ ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో సహజ 6-2, 6-4తో ఎనిమిదో సీడ్ పోలినా సెంకో(రష్యా)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన సహజ..ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్ను తన వశం చేసుకుంది. మరోవైపు డబుల్స్లో సహజ, ఆదిత్య కరుణరత్నె జోడీ 6-3, 6-3తో యతావీ చిమ్చమ్, పవీని రౌమ్క్(్రథాయ్లాండ్) ద్వయంపై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. తదుపరి రౌండ్లో సలక్పతిప్ ఔమునాంగ్, హేష యు చిహ్ జోడీతో సహజ, ఆదిత్య తలపడనున్నారు.