హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్పెయిన్ వేదికగా జరిగిన కోపా స్మార్ట్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీమన్య రెడ్డి టైటిల్ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీమన్య 6-2, 6-2తో లారా డయాజ్గార్సియా (స్పెయిన్)పై అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన శ్రీమన్య వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. బలమైన ఫోర్హ్యాండ్ షాట్లకు తోడు పదునైన ఏస్లతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది.